కమాన్చౌరస్తా, మార్చి 1: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫూలే మైదానం (సర్కస్ గ్రౌండ్) బుక్ ఫెయిర్కు రెడీ అయింది. తెలంగాణ సాహితీ అకాడమీ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 2 నుంచి 8 వరకు ఈ పుస్తక ప్రదర్శన నిర్వహించారు. 52 స్టాళ్లు, పదుల సంఖ్యలో పబ్లిషర్లు, వేల సంఖ్యలో పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు. మె ప్మా ఆధ్వర్యంలో 5 ఫుడ్ స్టాల్స్ కూడా సి ద్ధం చేస్తున్నారు. ఈ పుస్తక మహోత్సవం నిర్వహించే ప్రాంగణానికి జిల్లాకు చెందిన పద్మశ్రీ శ్రీ భాష్యం విజయ సారధి, వేదికకు పాకాల యశోదారెడ్డి, ద్వారానికి రేగులపాటి కిషన్రావు పేర్లు పెట్టారు. ఇక్కడ ప్రతి రోజూ సాయంత్రం సాంసృతిక కార్యక్రమాలు, రచయితలు, కవులతో కా ర్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే, తెలంగాణ వంటకాలతో కూడిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టాళ్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 8 గంటల వరకు కొనసాగుతాయి.
అందుబాటులో అన్ని రకాల పుస్తకాలు
ఈ బుక్ ఫెయిర్లో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. చిన్న పిల్లలు ఇష్టపడే కథల నుంచి పెద్ద ఇష్టపడే లిటరేచర్ పుస్తకాల వరకు ఉంటాయి. ముఖ్యంగా చరిత్ర, ప్రముఖుల జీవిత చరిత్రలు, రాజకీయ విజ్ఞానం, భాషా సాహిత్యాలు, సామాజిక శాస్త్రం, అర్థశాస్త్రం, జర్నలిజం, విజ్ఞాన శాస్త్రాలు, ఆరోగ్యం, విద్య, బాలసాహిత్యం, కథలు, న వలలు, పాటలు, సమకాలీన రాజకీయాలు, వ్యక్తిత్వ వికాసం ఇంగ్లిష్ గ్రామర్, డిక్షనరీలు ఇలా అన్ని రకాల పుస్తకాలు లభిస్తాయి.
తొలిరోజు కార్యక్రమాలు ఇవే..
పుస్తక ప్రదర్శనలో భాగంగా గురువారం 10 గంటలకు వివిధ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. భేటీ బచావో- భేటీ పడావో అంశంపై సంతకాలు సేకరిస్తారు. మధ్యాహ్నం ‘ప్రకృతి మనది- రక్షణ మనదే’ అంశంపై చిత్రలేఖన పోటీలు, సాయంత్రం 5 గంటల నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు, బుక్టాక్, వానమామలై జగన్నాథాచార్యులు పురస్కారం ప్రదానం, ఆ తర్వాత సాహిత్య సమాలోచన, నిర్వహించనున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ కర్ణన్
బుక్ ఫెయిర్కు సంబంధించిన ఏర్పాట్లును కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బుధవారం, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్లాల్ ప్రత్యేకంగా పరిశీలించారు. పుస్తకాల ప్రదర్శన, స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన విషయాలపై నిర్వాహకులతో చర్చించారు. పుస్తక ప్రదర్శన వీక్షించేందుకు వచ్చే వారు కూర్చోనేందుకు కుర్చీలు, టెంట్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
అందుబాటులో అన్ని పుస్తకాలు
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పా టు చేస్తున్న బుక్ ఫెయిర్లో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఒకటో తరగతి విద్యార్థి నుంచి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల వ రకు, కవితలు, కథలు, నవలలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ అవకాశాన్ని జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలి.
– జీవీ శ్యాంప్రసాద్లాల్, అనదపు కలెక్టర్
మంచి అవకాశం..
పుస్తకాలను ప్రతి ఒక్కరికీ దగ్గర చేయాలనే సంకల్పంతోనే బుక్ ఫెయిర్ నిర్వహి స్తున్నాం. ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనే రకాల పబ్లిషర్లు ప్రచురించిన పుస్తకాలు అందుబాటులో ఉంచాం. చిన్నపిల్లలలకు సంబంధించిన బుక్స్ నుంచి మొదలు, భగవత్గీత, రామాయణం వంటి ఇతిహాస గ్రంథాలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రదర్శనకు కరీంనగర్ జిల్లా నుంచే కాగా, ఉమ్మడి జిల్లా వ్మాప్తంగా పాఠకులు, విద్యార్థులు వచ్చేలా ఆహ్వానాలు అందించాం.
– కోయ చంద్రమోహన్, తెలంగాణ బుక్ ఫెయిర్ కార్యదర్శి
తక్కువ ధరకు బుక్స్ అందిస్తున్నాం
మా పబ్లిషింగ్ హౌస్ ఆధ్వర్యంలో 10 నుంచి 30 శాతం తగ్గింపు ధరలకు పుస్తకాలను అందిస్తాం. విద్యార్థులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉంచాం. ఇందులో చరిత్ర, సైన్స్, భక్తి, ముక్తి ఇలా అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచాం. పాఠకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.
– పురుషోత్తం సతీశ్, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ మేనేజర్