ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
పలు గ్రామాల్లో పర్యటన
పల్లెప్రగతి పనుల ప్రారంభం, చెక్కుల పంపిణీ
మహిళ వద్ద విస్తర్లు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే
సారంగాపూర్, జూన్ 19: గ్రామాల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా మానేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మె ల్యే సంజయ్ ఆదివారం వర్షంలోనే పర్యటిస్తూ పల్లెప్రగతి పనులను ప్రారంభించి, లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నాగునూర్ గ్రా మానికి చెందిన మహిళ వద్ద ఆదివారం ఎమ్మెల్యే రూ.200 చెల్లించి విస్తర్లను కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ పేపర్ల వాడకం మానేసి, విస్తర్లను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున, జడ్పీటీసీ మేడిపెల్లి మనోహర్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు గుర్రాల రాజేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఏలేటి నర్సింహా రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కోల శ్రీనివాస్, నాయకులు అనంతుల గంగారెడ్డి, బిట్ల రమేశ్ పాల్గొన్నారు.