Odela | ఓదెల, జులై 24 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా గంటా కొమరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.45 వేల విలువ గల ఏసీని మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గంట రాములు యాదవ్ శుక్రవారం అందజేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయానికి ఏసీని వితరణ చేస్తున్నట్లు తెలిపారు. కేటీఆర్ జన్మదినాన భక్తుల కోసం ఏసీ ని ఆలయానికి అందజేయడం సంతోషంగా ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా కేటీఆర్ పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. అలాగే కేక్ కట్ చేసి, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సదయ్య, అర్చకులు, ఆలయ సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు ఐరెడ్డి వెంకటరెడ్డి, ఆళ్ల రాజిరెడ్డి, ఆరెల్లి మొండయ్య గౌడ్, మ్యాడగొని శ్రీకాంత్ గౌడ్, సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.