పెద్దపల్లి జంక్షన్/, జ్యోతినగర్, డిసెంబర్ 8: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్ట్రిసిటీ అమెడ్మెంట్ బిల్ 2021, విద్యుత్ రంగం ప్రవేటీకరణకు వ్యతిరేకంగా భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం ఎస్ఈ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణపై వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం ఎదుట తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి ధర్నా చేశారు. ఎస్ఈ బొంకూరి సుదర్శనం ఇంజినీర్ల సంఘం జిల్లా కార్యదర్శి వీ ప్రభాకర్, పవర్ డిప్లామా ఇంజినీర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బొంకూర్ రవీందర్, 1104 యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీ రామానుజం, అకౌంట్స్ ఆఫీసర్ల సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, డీఈ కన్స్స్ట్రక్షన్ ఈశ్వర్ ప్రసాద్, రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం ఓఅండ్ఎం, ఎలక్ట్రికల్ డీఈలు కే శ్రీనివాసరావు, శంకరయ్య, బీ థర్మల్ విద్యుత్ కేంద్రంకు చెందిన 1104, 327, 1535, హెచ్-58 ట్రేడ్ యూనియన్ల నాయకులు, కార్మికులు ఉన్నారు.