వీణవంక, మే 17: మండల కేంద్రంలో మూడు రోజులుగా జరిగిన సీఎం కప్ మండల స్థాయి క్రీడాపోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ హాజరై మాట్లాడారు. క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేందుకే ప్రభుత్వం సీఎం కప్ టోర్నమెంట్ను నిర్వహించిందని పేర్కొన్నారు. మండల స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయిలోనూ రాణించాలని సూచించారు. కాగా, మండల స్థాయి వాలీబాల్ పోటీల్లో మల్లారెడ్డిపల్లి, కబడ్డీలో చల్లూరు, ఖోఖోలో మల్లారెడ్డిపల్లి జట్లు గెలుపొందాయి. ఆయా జట్ల క్రీడాకారులతో పాటు అథ్లెటిక్స్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి ఎంపీపీ ముసిపట్ల రేణుక, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, అధికారులు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి పవన్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈవో శ్రీనివాస్, ఎంపీవో ప్రభాకర్, ఉపసర్పంచ్ వోరెం భానుచందర్, మండల పరిషత్ జూనియర్ అసిస్టెంట్ అబ్దుల్ హకీం, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
జమ్మికుంటలో..
జమ్మికుంట, మే 17: జమ్మికుంట ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో మూడు రోజులుగా జరుగుతున్న సీఎం కప్ పోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ డాక్టర్ శ్రీరాం శ్యాం హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంత యువతలోని ప్రతిభను వెలికితీసేందుకే సీఎం కేసీఆర్ మండలస్థాయి క్రీడా పోటీలను ఏర్పాటు చేశారని, రాష్ట్రస్థాయిలో రాణించేందుకు ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు. తర్వాత గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందించారు. అనంతరం ఎంపీడీవో కల్పన, మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్, ప్రత్యేకాధికారి నవీన్కుమార్, కమిషనర్ బీ శ్రీనివాస్ జిల్లాస్థాయి క్రీడలకు ఎంపికైన వారి పేర్లను ప్రకటించారు. ఇక్కడ ఎంపీవో సతీశ్రావు, అధికారులు, హెచ్ఎంలు, పీడీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సిబ్బంది, క్రీడాకారులు, తదితరులున్నారు.
సైదాపూర్లో..
సైదాపూర్, మే 17: మండలకేంద్రంలోని వెన్కేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మూడు రోజులుగా కొనసాగిన సీఎం కప్ క్రీడలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందించారు. క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్ఐ జన్ను ఆరోగ్యం, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చంద శ్రీనివాస్, ఎంపీడీవో పద్మావతి, సర్పంచులు కొండ గణేశ్, కొత్త రాజిరెడ్డి, ఆవునూరి పాపయ్య, ఎంపీటీసీ ఏరుకొండ ఇందిరా సుధీర్గౌడ్, పీడీ వెంకటరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
హుజూరాబాద్లో..
హుజూరాబాద్టౌన్, మే 17: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆర్డీవో బీ హరిసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, ఎంపీపీ ఇరుమల్ల రాణీసురేందర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, క్రీడల్లో ప్రతిభా చూపిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణించి హుజూరాబాద్కు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వీ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఎస్ సమ్మయ్య, ఎస్సై జీ రాజన్న, ఎంఈవో కేవీ నరసింహారెడ్డి, హాకీ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కబడ్డీ క్లబ్ అధ్యక్షుడు కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మంతెన శ్రీనివాస్, ఎంపీవో సురేందర్, పీడీ సొల్లు సారయ్య, పీఈటీ వై రవికుమార్, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు.