ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
మండలంలోని పలు గ్రామాల్లో పర్యటన
లబ్ధిదారులకుసీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
మానకొండూర్ రూరల్, ఫిబ్రవరి 15: నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మం గళవారం మండలంలోని వన్నారం, శంషాబాద్, గట్టుదుద్దెనపల్లి, చెంజర్ల, నిజాయితీగూడెం, పెద్దూర్పల్లి, ఖాదరగూడెం గ్రామాల్లో పర్యటించారు. లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి సీఎంఆర్ఎఫ్, క ల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. పలువురిని ఆత్మీయంగా పలకించారు. సమస్యలపై ఆరా తీ శారు. గట్టుదుద్దెనపల్లిలో రూ. 25 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. గ్రామాలకు వెళ్లిన ఎమ్మెల్యేకు మహిళలు, గ్రామస్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. చెంజర్లలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంట్లోనే ఉంటున్న బుర్ర అనిల్గౌడ్ను పరామర్శించారు. వీరి వెంట సర్పంచ్లు పొలాడి కవిత, రమేశ్, దేవ సతీశ్రెడ్డి, వేణు గోపాల్, మురళీధర్, ప్రశాంతి, రాజు, ఎంపీటీసీలు నర్సింగారావు, గడ్డి రేణుక-గణేశ్ ఉన్నారు.