కలెక్టర్ సంగీత సత్యనారాయణ
‘ఇన్స్పైర్’కు ఎంపికైన విద్యార్థులకు అభినందన
పెద్దపల్లి జంక్షన్, ఫిబ్రవరి 12: త్వర లో జరుగబోయే జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా విద్యార్థులు ప్రతిభచూపాలని కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయ ణ ఆకాంక్షించారు. ప్రతి యేటా కేంద్ర ప్రభుత్వం, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జా తీయ ఇన్స్పైర్ 2020 -21 పోటీలకు రామగిరి మండలం చందనాపూర్ జడ్పీ స్కూల్ విద్యార్థులు డీ హర్షిత(7వ తరగతి), పీ స్నేహలత (9వ తరగతి), ఎం సాయి నివాస్(10వ తరగతి) అలాగే సుల్తానాబాద్లోని అల్ఫోర్స్ పాఠశాల విద్యార్థిని ఎం పూజ(7వ తరగతి) ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం సదరు విద్యార్థులను, గైడ్ టీచర్లకు కలెక్టర్ తన చాంబర్లో పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు.
ఎమ్మెల్యే అభినందనలు..
వైజ్ఞానిక పదర్శనకు ఎంపికైన నలుగురు విద్యార్థులను కలెక్టరేట్ ఆవరణలో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అభినందించారు. అలాగే జిల్లా అదనపు కలెక్టర్లు వీ లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్ సైతం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, డీఈవో డీ మాధవి, జిల్లా సైన్స్ అధికారి బీ రవినందన్రావు, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వీ నరేందర్రెడ్డి, గైడ్ టీచర్లు సంపత్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.