ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుకు కృషి
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
మల్యాల, ఫిబ్రవరి 12 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయ పాలకమండలి సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ కార్యాలయంలో నిర్వహించిన
ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ సన్నిధానంలో మాస్టర్ ప్లాన్ను అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ సంసిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగాఎమ్మెల్యే వెల్లడించారు. ఆలయ అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సభ్యులకు సూచించారు.
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పాలకమండలి సభ్యులు శని వారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ కార్యా లయంలో జరిగిన ఈ కార్యక్రమానికి దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ చంద్రశేఖర్తో కలిసి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలుగా నియమితులైన గన్ను శ్రీనివాసరెడ్డి, గొల్లపెల్లి శ్రావణ్కుమార్, పుల్కం నర్సయ్య, ఉప్పుల గంగాధర్, బండపల్లి యాదగిరి, దాసరి రాజేందర్ రెడ్డి, జన్న సురేందర్, పోచమ్మల ప్రవీణ్కుమార్, కొంక నర్సయ్య, బొడ్ల సతీశ్, వొల్లాల లింగం గౌడ్, బెంద్రం మాధవరెడ్డి, ఎక్స్ అఫీషియో సభ్యుడు అర్చకుడు జితేంద్రప్రసాద్తో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ఆలయ మాస్టర్ ప్లాన్ను అమలు చేసేం దుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొ న్నారు. ధర్మకర్తలందరికీ శుభాకాంక్షలు తెలుపడంతోపాటు ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని సూచించారు.
అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు ఆలయ అభివృద్ధి విషయంలో ప్రత్యేక చొరవను చూపుతున్నారని, ఈ క్రమంలోనే అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్న సమయంలో తనను ప్రత్యేకంగా పిలిపించుకుని ఆలయ అభివృద్ధి, మాస్టర్ప్లాన్ విషయంపై చర్చించారని గుర్తు చేశారు. త్వరలోనే సీఎం కేసీఆర్ కొండగట్టుకు వచ్చే అవకాశాలు ఉ న్నాయని తెలిపారు. ఆలయాల అభివృద్ధిపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఈ క్రమంలోనే కొండగట్టులో రామకోటి స్తూప నిర్మాణం, ఆల య నూతన కార్యాలయ భవనం, మెట్ల దారి ఆ ధునీకరణ, దీక్ష విరమణ మండపం, ఓపెన్షెడ్డు నిర్మాణం, సీతమ్మవారి బండ పునరుద్ధరణ లాం టి కార్యక్రమాలను చేపట్టామన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత సహకారంతో గతేడాది అ ఖండ హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టామని, ఈ ఏడాది సైతం చిన్న హనుమాన్ జయం తి నుంచి పెద్ద హనుమాన్ జయంతి వరకు 41 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు శాశ్వత ప్రాతిపదికన పారాయణ మండపాన్ని నిర్మించేందుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలను రూపొందిస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆలయ ఉద్యోగులు, అర్చకులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లిస్తున్నామన్నా రు. అనంతరం ధర్మకర్తలతో కలిసి ఎమ్మెల్యే పూజ లు చేశారు. అర్చకులు ధర్మకర్తలను సన్మానించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఈవో టంకశాల వెంకటేశ్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకుడు శ్రీనివాస్ శర్మ, సునీల్, ఆలయ ఇన్స్పెక్టర్లు రాజేశ్వర్రావు, సంపత్, సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ కొండపలుకుల రామ్మోహన్రావు, కరీంనగర్ జి ల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్రెడ్డి, నా యకులు మిట్టపల్లి సుదర్శన్, జనగం శ్రీనివాస్, ముత్యాల రాంలింగారెడ్డి, బోయినిపల్లి మధుసూదన్రావు, మేన్నేని స్వర్ణలత, పునుగోటి ప్రశాంతి, మధుకర్, కొండయ్య, కృష్ణారావు, వీర్ల వెంకటేశ్వర్రావు, రాజనర్సింగరావు, సామల్ల దేవరాజం, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, సహకార సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.