హైదరాబాద్: ఒలింపిక్స్పై ప్రజలందరిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడానికి, టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనబోతున్న ఆటగాళ్ల బృందానికి మద్ధతు ప్రకటించడానికి తెలంగాణ సర్కారు చీర్4ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్.. YAT C సెక్రెటరీ, ఐఏఎస్ అధికారి శ్రీనివాస్ రాజుతో కలిసి ఈ క్యాంపెయిన్ ప్రారంభించారు.
చీర్4ఇండియా క్యాంపెయిన్లో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సెల్ఫీ పాయింట్ల ద్వారా 2021, జూలై నుంచి రోడ్ టు టోక్యో ఒలింపిక్స్ 2020 పేరుతో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.