నిడమనూరు, ఏప్రిల్ 8: అడగకుండానే ప్రజల అవసరాలు తీరుస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వానికి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మద్దతు పలుకాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం మండలంలోని ముప్పారం, వెంగన్నగూడెం, బొక్కమంతల పహాడ్, ముకుందాపురం గ్రామాల్లో గురువారం రాత్రి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాగర్ అభివృద్ధి టీఆర్ఎస్తోనే ప్రారంభమైందన్నారు. అభివృద్ధిని కొనసాగించేందుకు కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.