న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఇంటర్నెట్ లేకపోయినా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ను ఇతరులకు ఆఫ్లైన్లోనే షేర్ చేసే సదుపాయాన్ని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ ఫీచర్ ద్వారా ఇకపై నెట్వర్క్తో పనిలేకుండా డాక్యుమెంట్లను పంపించొచ్చు.
ప్రస్తుతం ఇంటర్నెట్ లేకుండా షేర్ఇట్ వంటి వాటి ద్వారా ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకొంటున్న మాదిరిగానే.. ఆ తరహా సేవల్నే వాట్సాప్ అందుబాటులోకి తేనున్నది. ఈ ఫీచర్ను ఎనేబుల్ చేసుకోవాలంటే యాక్సెస్ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.