విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధిపై సమీక్ష
ఆర్కేపురం, మే 3: గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, కార్యదర్శి మనోజ్కుమార్తో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రంథాలయాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. హైస్కూల్ విద్యార్థులకు గ్రంథాలయ సేవలు నేరుగా అందించాలన్న ఉద్దేశంతో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని హైస్కూళ్లలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న గ్రంథాలయాల నిర్మాణాలపై చర్చించారు. మొదటగా మోడల్ గ్రంథాలయాన్ని చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. హైస్కూల్ ప్రాంగణంలో కంటైనర్ ఏర్పాటు చేసి అందులో ఫర్నిచర్, పుస్తకాలు అందుబాటులో ఉంచాలని కోరారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలోని గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలన్నారు సూచించారు.