Lion Attack | ఒక దశాబ్ద కాలంగా సింహాల బాగుగోలు చూసుకుంటున్న సంరక్షకుడిని ఓ సింహాం చంపేసింది. ఈ ఘటన నైజీరియన్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. నైజీరియాలోని ఓబఫెమి అవులావో యూనివర్సిటీలో జంతు ప్రదర్శన శాల ఉంది. దీంట్లో సింహాలతో పాటు పలు జంతువులు ఉన్నాయి. అయితే ఓలాబోడే ఓలవూయి అనే వ్యక్తి ఆ జూలో సింహాల బాగోగులు చూసుకుంటున్నాడు. సోమవారం సింహాలకు ఆహారం పెడుతుండగా, అందులోని ఓ సింహాం ఓలవూయిపై ఆకస్మాత్తుగా దాడి చేసింది. దీంతో అప్రమత్తమైన తోటి సిబ్బంది సింహాం దాడి నుంచి ఓలవూయిని కాపాడేందుకు యత్నించారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. చివరకు ఓలవూయి చనిపోయాడు.
ఓలవూయి వెటర్నరీ టెక్నాలజిస్ట్గా సేవలందిస్తున్నట్లు యూనివర్సిటీ సిబ్బంది తెలిపారు. గత తొమ్మిదేండ్ల క్రితం ఈ సింహాలు ఇక్కడి జూలో జన్మించాయి. అప్పట్నుంచి వాటి సంరక్షణను ఓలవూయి చూసుకుంటున్నట్లు యూనివర్సిటీ అధికార ప్రతినిధి అబియోడన్ ఓలారేవాజు తెలిపారు. ఓలవూయి మగ సింహాం చంపినట్లు పేర్కొన్నారు. ఆ మగ సింహాం ఓలవూయిపై దాడి చేస్తుందని తాము ఊహించలేదన్నారు.
ఈ ఘటనపై యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ అడేబేయో సిమోయెన్ బామైర్ స్పందించారు. సింహాం దాడిలో ఓలవూయి చనిపోవడం విషాదకరమన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.