రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో కీవ్కు చెందిన ఓ మీడియా సంస్థ సంచలన విషయాన్ని బయటపెట్టింది. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశం కావాలని నిర్ణయించారని, ఈ మేరకు ఓ ప్రతిపాదన కూడా పుతిన్కు పంపినట్లు ఆ మీడియా సంస్థ పేర్కొంది. జెరూసలేం వేదికగా సమావేశమవుదామని పుతిన్ ముందు జెలెన్స్కీ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ ప్రధాని బెన్నెట్ను మధ్యవర్తిగా ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరినట్లు మీడియా సంస్థ పేర్కొంది.
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించి, అమెరికాతో సహా పలు దేశాల ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్తో జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ఫోన్లో సంభాషించారు. ఈయనతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మక్రాన్ కూడా ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపాలనే వీరిద్దరూ పుతిన్కి సూచించారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు.