ఉక్రెయిన్పై బాంబులతో రష్యా విరుచుకుపడుతోంది. 20 రోజులుగా రష్యా బాంబులతో విరుచుకుపడుతూనే వుంది. తమ లక్ష్యం పూర్తయ్యే వరకూ ఇలా కొనసాగుతూనే వుంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ కీలక ప్రకటన చేశారు. నాటోలో తాము చేరదల్చుకోలేమని ప్రకటించారు. ఈ వాస్తవాన్ని ప్రజలందరూ అంగీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత.. జరిగిన మొదటి రౌండు చర్చల్లోనూ ఉక్రెయిన్ ఇదే ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధం 20 వ రోజుకు చేరిన నేపథ్యంలో జెలెన్స్కీ మళ్లీ ఇదే ప్రకటన చేశారు.
రష్యా ఇవాళ తెల్లవారుజామున భీకర ఫైరింగ్ జరిపింది. కీవ్పై మిస్సైళ్ల వర్షం కురిపించింది. జనావాసాలను టార్గెట్ చేశారు. కీవ్లోని పలు ప్రాంతాల్లో ఉన్న బిల్డింగ్లు ఆ దాడికి ధ్వంసం అయ్యాయి. సతోసిన్స్కీ జిల్లాలో 9 అంతస్తుల బిల్డింగ్ మంటల్లో చిక్కుకున్నది. దానికి సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేశారు. ఈ ఘటనలో ఎవరైనా మృతిచెందారా అన్న విషయాన్ని ఇంకా తెలుపలేదు. మరో టార్గెట్లో మెట్రో స్టేషన్ ధ్వంసమైంది. లుకియానిస్కా మెట్రో స్టేషన్ను పేల్చేశారు. కీవ్ సెంటర్కు సమీపంలో ఈ స్టేషన్ ఉంటుంది. డ్యామేజ్ కావడం వల్ల ఆ స్టేషన్ను మూసివేశారు.