దావోస్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవాలనుకుంటున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వీడియో లింక్ ద్వారా జెలెన్స్కీ ప్రసంగించారు. రష్యాతో చర్చలు నిర్వహించడం కష్టసాధ్యంగా మారుతున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్లో సాధారణ పౌరులను టార్గెట్ చేయడం వల్ల రష్యాతో సంప్రదింపులు అసాధ్యం అవుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ యుద్ధం అంతం చేయాలంటే అది రష్యా అధ్యక్షుడితోనే సాధ్యమని, ఆయన వ్యక్తిగతంగా చర్చల్లో పాల్గొనకుండా దీనిపై నిర్ణయం తీసుకోలేమని జెలెన్స్కీ అన్నారు. కీవ్ సమీపంలో సామూహిక ఖనన ప్రదేశాలు వెలుగులోకి వస్తున్నా కొద్దీ రష్యాతో శాంతి చర్చలను నిర్వహించడం కష్టంగా మారుతున్నట్లు ఆయన అన్నారు. రష్యాకు చెందిన అధికారులు చర్చలకు ఎవరూ అవసరం లేదని, ఆ దేశ అధ్యక్షుడే కీలకమని జెలెన్స్కీ తెలిపారు.యుద్ధాన్ని ఆపడమే ముఖ్యం అనుకుంటే, అప్పుడు ఆ మీటింగ్ టేబుల్పై పుతిన్ ఉండాలని జెలెన్స్కీ అన్నారు.