కీవ్: జాపరిజిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూరోప్లోనే అత్యంత పెద్దది. ఆ ప్లాంట్ను రష్యా బలగాలు సీజ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్ని ఉక్రెయిన్ ఖండించింది. రష్యా దళాలు జాపరిజిజియా ప్లాంట్ను స్వాధీనం చేసుకోలేదని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్కు చెందిన న్యూక్లియర్ కంపెనీ ఎనర్గోటమ్ దీనిపై ఓ ప్రకటన రిలీజ్ చేసింది. జాపరిజిజియా ప్లాంట్ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఆ ప్లాంట్ను సీజ్ చేశామని, అక్కడ నార్మల్ వాతావరణం ఉన్నట్లు సోమవారం రష్యా చెప్పిన విషయం తెలిసిందే. రష్యా సైనికులు ఆ ప్లాంట్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారని, ఇప్పుడు ఆ ప్లాంట్ వారి కంట్రోల్లో ఉన్నట్లు మేజర్ జనరల్ ఇగర్ కొనషెంకో తెలిపారు. న్యూక్లియర్ ప్లాంట్లో రేడియో యాక్టివిటీ కూడా నార్మల్గా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే చెర్నోబిల్ అణు ప్లాంట్ను రష్యా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.