ఆరిజోనా: అమెరికాలో పింక్ షర్ట్ కపుల్(Pink Shirt Couple) చాలా ఫేమస్. సోషల్ మీడియాలో ఆ జంటను ఫాలో అయ్యే వారు ఎక్కువ. ఇక యూట్యూబ్లో ఆ జంటను సుమారు 2.5 కోట్ల మంది ఫాలోఅవుతున్నారు. కేవలం మూడేళ్లలోనే ఆ జంట ఫుల్ పాపులారిటీ సంపాదించింది. గులాబీ రంగు టీషర్ట్లు వేసుకుని ఆ దంపతులు రకరకాల వీడియోలను ఆన్లైన్లో పోస్టు చేసేవారు. తొలుత ఆ జంట టిక్టాక్లో చాలా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత లెన్త్ ఎక్కువ వీడియోలను చూసి యూట్యూబ్లో పోస్టు చేశారు. దీంతో ఆ కపుల్.. యూట్యూబ్ స్టార్స్గా మారారు.
కానీ అకస్మాత్తుగా ఆ జంట బ్రేకప్ అవుతున్నట్లు చేసిన ప్రకటన ఆన్లైన్ అభిమానుల్లో కలవరం రేపుతున్నది. కేడన్ క్రిస్టియన్సన్, అలెసా ఎక్స్టీన్ అనే ఇద్దరికీ యూట్యూబ్లో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. అమెరికాలోని ఆరిజోనాకు చెందిన ఈ జంట తమ బ్రేకప్ గురించి తాజా వీడియోలో వెల్లడించింది. జంటగా విడిపోతున్నాం కానీ స్నేహితులుగా కలిసి ఉంటామన్నారు.
2021లో కేడన్, అలెసా కాలేజీ స్విమ్ టీమ్ ద్వారా కలుసుకున్నారు. డేటింగ్కు ముందు విడివిడిగా వీడియోలు చేశారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆన్లైన్ కాంటెంట్ క్రియేట్ చేశారు. ఒకరికి ఒకరు ఛాలెంజ్లు విసురుతూ ఆన్లైన్ వ్యూవర్స్ను ఆకట్టుకున్నారు. అన్ని ఏజ్ గ్రూపులకు చెందిన చిలిపి వీడియోలను పోస్టూ చేస్తూ థ్రిల్ చేశారు. ప్రతి రోజూ పింక్ షర్ట్లోనే ఆ జంట తమ వీడియోలను క్రియేట్ చేసేది. ఆన్లైన్లో బెస్ట్ కపుల్గా ప్రూవ్ చేసినా.. బిజినెస్ పార్ట్నర్గా విఫలమైనట్లు కొందరు కామెంట్ చేస్తున్నారు.