Giorgia Meloni : ఇటలీ ప్రధాని (Italy Prime Minister) జార్జియా మెలోని (Georgia Meloni) కి భారత్ (India) పై ఉన్న ప్రత్యేక అభిమానం మరోసారి అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఆమెకు మెలోడీ చాక్లెట్లు (Melodi Chacolets) కానుకగా ఇచ్చిన విజువల్స్ ఇప్పటికే సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయ్యాయి. తాజాగా ఆమె రాసిన సరికొత్త పుస్తకం ‘జార్జియాస్ విజన్ (Georgia’s Vision)’ లో భారత్ పర్యటనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఢిల్లీ పర్యటనలో తనకు లభించిన గ్రాండ్ వెల్కమ్ గురించి రాస్తూ… రోడ్డుకు ఇరువైపులా తన భారీ పోస్టర్లను చూసి మురిసిపోయానని మెలోని తన కొత్త పుస్తకంలో పేర్కొన్నారు. ఆ సమయంలో తన పక్కనే ఉన్న ఇటలీ ఉప ప్రధాని ఆంటోనియో తజని తనతో మాట్లాడుతూ.. ‘ఈ క్రేజ్ చూస్తుంటే మీరు గనుక ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేస్తే కనీసం 10 లక్షల మెజారిటీతో గెలుస్తారు’ అని చమత్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. 2023లో రైసినా డైలాగ్, జీ20 సదస్సుల కోసం రెండుసార్లు భారత్లో పర్యటించిన మెలోని.. ‘అడుగడుగునా నా ఫొటోలతో స్వాగతం పలికిన భారత్కు థాంక్స్’ అంటూ మన దేశంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.