రోమ్: రష్యా ఉక్కు వ్యాపారవేత్త, బిలియనీర్ అలెక్సీ మోర్డషోవ్కు చెందిన నౌకను ఇటలీలో సీజ్ చేశారు. రష్యాపై ఆంక్షల విధింపులో భాగంగా రష్యా వ్యాపారవేత్తకు చెందిన అత్యంత ఖరీదైన నౌకను స్వాధీనం చేసుకున్నారు. తీర ప్రాంత నగరం ఇంపీరియా వద్ద దీన్ని అదుపులోకి తీసుకున్నారు. లేడీ ఎం యాచ్ ఖరీదు సుమారు 70 మిలియన్ల డాలర్లు ఉంటుందని ఇటలీ అధికారులు అంచనా వేస్తున్నారు. లేడీ ఎం బోటును పోలీసులు చుట్టుముట్టారు. సివర్స్టాల్ స్టీల్ కంపెనీలో మోర్డషోవ్ ప్రధాన షేర్హోల్డర్. ఆ కంపెనీ ఆస్తులు బిలియన్లలో ఉన్నాయి. ప్రతి ఏడాది ఆ కంపెనీ సుమారు 2.5 మిలియన్ల టన్నుల ఇనుమును సరఫరా చేస్తుంది. అయితే రష్యా అధికార భవనంతో లింకులు ఉన్న నేపథ్యంలో మోర్డషోవ్ను బ్లాక్లిస్టులో పెట్టారు.