గ్లాస్గో: అడవుల నరికివేతపై ప్రపంచ దేశాధినేతలు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. గ్లాస్గోలో జరుగుతున్న కాప్26 వాతావరణ సదస్సులో నేతలంతా వాగ్ధానం చేయనున్నారు. 2030 నాటికి అడవుల నరికివేతకు ఫుల్స్టాప్ పెట్టేస్తామని వంద మంది దేశాధినేతలు ప్రకటించనున్నారు. మంగళవారం దీనిపై సంతకాలు చేయనున్నారు. అమెజాన్ అడవుల్ని కోల్పోతున్న బ్రెజిల్ కూడా ఈ ఒప్పందంపై సంతకం చేయనున్నది. అడవుల నరికివేత నిర్మూలనకు బ్రేక్ వేసేందుకు 19.2 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయనున్నారు. దేశాధినేతలు తీసుకున్న నిర్ణయాన్ని నిపుణులు ఆహ్వానించారు. కానీ 2014 వరకు అడవుల నరికివేతను ఆపాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయినట్లు చెప్పారు. వృక్షాల నరికివేత వల్ల భారీగా వాతావరణ మార్పులు జరుగుతున్నాయని, చెట్లు తగ్గడం వల్ల కార్బన్ ఉద్గరాలను భారీ మొత్తంలో రిలీజవుతున్నాయన్నారు. వాతావరణ మార్పులను అదుపులోకి తెచ్చేందుకు గ్లాస్గో సమావేశం కీలకంకానున్నది. కెనడా, బ్రెజిల్, రష్యా, ఇండోనేషియా లాంటి దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేయనున్నాయి. ఈ దేశాల్లోనే దాదాపు 85 శాతం అడవులు ఉన్నాయి.