వాషింగ్టన్: కరోనా తర్వాత ప్రపంచదేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ను వరల్డ్ హెల్త్ నెట్వర్క్ (డబ్ల్యూహెచ్ఎన్) మహమ్మారిగా(పాండమిక్) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తున్నదని, అన్ని దేశాలూ కలిసికట్టుగా చర్యలు తీసుకోకపోతే దీన్ని అడ్డుకోవడం కష్టమని హెచ్చరించింది.
మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ నివారణ చర్యలు తీసుకోకపోతే మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని, అనేక మంది దివ్యాంగులుగా మారతారని ఆందోళన వ్యక్తం చేసింది. మంకీపాక్స్ ఇప్పటివరకు 58 దేశాలకు విస్తరించింది. 3,417 కేసులు నిర్ధారణ అయ్యాయి.