న్యూయార్క్, మే 9: దోమలు మనిషి రక్తాన్నే ఎందుకు తాగుతున్నాయి? వేరే జీవుల రక్తాన్ని ఎందుకు తాగవు? అని అమెరికాకు చెందిన ప్రిన్స్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఆసక్తికర విషయం తెలిసింది. మనిషి వాసన దోమలకు నారింజ, పుల్లటి వాసనలా అనిపిస్తాయట.
ఆ వాసన రాగానే దోమల్లోని నాడీ వ్యవస్థ ఉత్తేజితమై మనిషి వైపు ఆకర్షిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మనిషి ఎక్కడున్నా వాసనను పసిగట్టి వచ్చేస్తుందని, రక్తాన్ని పీల్చేస్తుందని వెల్లడించారు. అదే, జంతువుల నుంచి అలాంటి వాసన రాదని.. అందుకే దోమలు వాటి దిక్కు కన్నెత్తి చూడవని వివరించారు.