రోమ్: వేల ఏండ్లుగా చెక్కుచెదరని రోమన్ కట్టడాలు అంత దృఢంగా ఎలా ఉన్నాయనేది శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పట్లో కాంక్రీట్ లేకపోయినా ఇంత బలంగా కట్టడాలు నిలవడానికి అందులో వాడిన పజ్జొలోనా అనే పదార్థామే కారణమని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అగ్నిపర్వతం బద్దలైన తర్వాత వెలువడే బూడిద, సున్నం మిశ్రమమే ఈ పజ్జోలోనా అని, దీన్ని నీటితో కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేసి దానిని బాగా మరిగించి కాంక్రీటుగా వాడేవారని పేర్కొన్నారు. ఈ కట్టడాలు వాటికవే మరమ్మతు అయ్యేలా నిర్మాణం జరిగాయని చెప్పారు. కాంక్రీటుగా వాడిన మిశ్రమం, దానిని బాగా వేడి చేసినప్పుడు కలిగిన మార్పుల వల్ల ఈ నిర్మాణాలకు పగుళ్లు ఏర్పడినా అవి క్రమంగా పూడ్చుకుంటాయని తెలిపారు.