కౌలాలంపూర్ : మన ఇంట్లోని సిం క్ నుంచి వృథాగా పోయే వ్యర్థ జలాలతో మలేషియా విద్యార్థులు విద్యుత్తును ఉత్పత్తి చేశారు. మలయా విశ్వవిద్యాలయానికి చెం దిన ముగ్గురు విద్యార్థులు అభి వృద్ధి చేసిన ‘వాట్స్అప్’ అనే ఈ పరికరం సింక్లోని నీరు వెంటనే డ్రెయిన్ లోకి వెళ్లిపోకుండా దానిని ఫిల్టర్ చేసి, కొంతసేపు నిల్వ చేస్తుంది.
తరువాత నాజిల్ ద్వారా అధిక వేగంతో నీటిని విడుదల చేస్తుంది. అలా ఏర్పడిన నీటి జెట్ ఒక చిన్న పెల్టన్ టర్బైన్ని తిప్పుతుంది. ఆ టర్బైన్ జనరేటర్కు అనుసంధానం చేసి నీటిని వినియోగించి విద్యార్థు లు విద్యుత్తును ఉత్పత్తి చేశారు.