వాషింగ్టన్, ఆగస్టు 10: వర్జిన్ గెలాక్టిక్ సంస్థ తన మొదటి అంతరిక్ష పర్యాటక రాకెట్ను గురువారం ప్రయోగించింది. బ్రిటన్కు చెందిన మాజీ ఒలింపియన్ జాన్ గుడ్విన్తోపాటు కరీబియన్కు చెందిన తల్లీ కూతుళ్లు కీషా షహాఫ్(46), అనాస్టాటియా మేయర్స్(18)ను రోదసిలోకి పంపింది.
అంతా సవ్యంగా సాగితే.. రిచర్డ్ బ్రాన్సన్కు చెందిన ఈ సంస్థ నెలవారీ యాత్రలను ఆఫర్ చేయనుంది. ప్రస్తుతం రోదసి యాత్రకు వెళ్లిన జాన్ గుడ్విన్ 18 ఏండ్ల కిందటే టికెట్ బుక్ చేసుకోవడం విశేషం. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన 80 ఏండ్ల వయసులో ప్రయాణం చేసి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు.