న్యూఢిల్లీ: భారతీయ యువత శక్తిసామర్ధ్యాలపై ప్రపంచ మేటి వ్యాపార దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ట్విట్టర్ సంస్థ ఈసీవోగా భారత్కు చెందిన పరాగ్ అగర్వాల్ను నియమించిన విషయం తెలిసిందే. దీనిపై టెస్లా సీఈవో ఎలన్ మస్క్ స్పందించారు. ప్రతిభావంతులైన భారతీయుల వల్ల అమెరికా లబ్ధి పొందుతున్నట్లు మస్క్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ సీఈవో పరాగ్ నియామకాన్ని స్వాగతిస్తూ.. లాస్ ఏంజిల్స్కు చెందిన స్ట్రైప్ కంపెనీ సీఈవో ప్యాట్రిక్ కొలిసన్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆయన భారతీయుల ట్యాలెంట్ను మెచ్చుకున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్వర్క్స్, ఇప్పుడు ట్విట్టర్ సీఈవో లు అందరూ ఇండియాలో పుట్టి, పెరిగినవాళ్లే అని, టెక్నాలజీ ప్రపంచంలో భారతీయులు అమోఘమైన విజయాన్ని సాధించడం అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. ఇమ్మిగ్రాంట్లకు అమెరికా ఇస్తున్న అవకాశాలు సద్వినియోగం అవుతున్నట్లు తన ట్వీట్లో ప్యాట్రిక్ తెలిపారు. అయితే ఆ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ మస్క్ దానిపై కామెంట్ చేశారు. గూగూల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల కొనసాగుతున్న విషయం తెలిసిందే.