హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు విధించిన లాక్డౌన్ నేటితో ముగియనుంది. 18 రోజుల పాటు కొనసాగిన లాక్డౌన్ నేటితో ముగియనుండటంతో రాష్ర్ట మంత్రివర్గం మరికాసేపట్లో కీలక నిర్ణయం తీసుకోనుంది. లాక్డౌన్ నుంచి రోజుకు 4 గంటలు మినహాయించారు. ఇక మిగతా 20 గంటలు పకడ్బందీగా లాక్డౌన్ను అమలు చేశారు.
మధ్యాహ్నం 2 గంటలక సమావేశమయ్యే రాష్ర్ట మంత్రివర్గం లాక్డౌన్తో పాటు ఇతర అంశాలపై చర్చించనుంది. వర్షాకాల వ్యవసాయ సీజన్ వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వ్యవసాయరంగంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచటం, రైతుబంధు అందజేత తదితర అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నది. ధాన్యం సేకరణ ఎంతవరకు వచ్చిందనే అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నది.