Kidney Transplantation | వాషింగ్టన్, మార్చి 21: ప్రపంచంలోనే తొలిసారి ఓ సజీవ రోగికి పంది కిడ్నీ మార్పిడి జరిగింది. అమెరికాలో జరిగిన ఈ సర్జరీ విజయవంతమైనట్టు అక్కడి వైద్యులు తెలిపారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ రోగికి పంది కిడ్నీని అమర్చినట్టు మసాచుసెట్స్ దవాఖానా వెల్లడించింది.
62 ఏండ్ల రోగి రెండు కిడ్నీలు ఫెయిలవ్వటంతో శనివారం అతనికి పంది కిడ్నీని మార్పిడి చేశారు.