వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై గరిష్ఠంగా 100 శాతం వరకు సుంకాలు విధించేందుకు చట్టపరమైన మార్గం త్వరలో ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన రష్యా ఆంక్షల బిల్లుపై అమెరికా ప్రతినిధుల సభలో బుధవారం మధ్యాహ్నం తుది ఓటింగ్ జరగనుంది. బిల్లు ఆమోదం పొందితే అధ్యక్షుడి ఆమోదానికి పంపిస్తారు.
మంగళవారం సాయంత్రం ప్రతినిధుల సభలో బిల్లు విధానపరమైన అడ్డంకిని అధిగమించింది. ఇద్దరు డెమోక్రాట్లు తమ పార్టీ నిర్ణయానికి భిన్నంగా రిపబ్లికన్లతో కలసి బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో తీర్మానం 241-211 ఓట్లతో ఆమోదం పొందింది. సెనేట్ ఇప్పటికే దీన్ని ఆమోదించింది.