న్యూయార్క్: కారు మోడ్ను పొరపాటున మార్చడంతో అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనెటర్ మిట్చ్ మెక్కానెల్ (Mitch McConnell) మరదలు, ఓ షిప్పింగ్ కంపెనీ సీఈవో మరణించారు. ప్రముఖ షిప్పింగ్ కంపెనీ ఫార్మోస్ట్ గ్రూప్ సీఈవో ఏంజెలా చావో (Angela Chao).. శుక్రవారం రాత్రి స్నేహితురాళ్లతో కలిసి టెక్నాస్లోని ఆస్టిన్ సమీపంలో ఉన్న తన ప్రైవేటు అతిథి గృహానికి వెళ్లారు. సుమారు 900 ఎకరాల్లో విస్తరించిన ఉన్న ఆ రాంచ్ గుండా మిల్లర్ సెలయేరు ప్రవహిస్తున్నది. అయితే ఓ రెస్టారెంట్లో రాత్రి వరకు గడిపి తిరిగి ప్రధాన భవనానికి కారులో బయల్దేరారు. ఈ క్రమంలో ఓ త్రీపాయింగ్ మూలమలుపు వచ్చింది.
దానిని దాటే క్రమంలో ఏంజెలా పొరబాటున తన టెస్లా ఎక్స్ ఎస్యూవీ కారును రివర్స్ మోడ్లోకి మార్చారు. దీంతో అది వేగంగా వెనక్కి వెళ్లి ఓ కొలనులో బోల్తాపడిపోయింది. తిరగడటంతో అది నీటిలో మునిపోయింది. అయితే ఆమె తన స్నేహితురాలికి పోన్ చేయడంతో.. గెస్ట్ హౌస్ మేనేజర్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏంజెలాను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై కేసే నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఏజెలా.. అమెరికాలో ప్రముఖ బిలియనీరు వెంచర్ క్యాపిటలిస్ట్ జిమ్ బ్రేయార్ సతీమణి, దేశ మాజీ రవాణాశాఖ మంత్రి ఎలాయినే చావోకు సోదరి.