వాషింగ్టన్: భారత్కు చెందిన సామాజిక ఉద్యమకారిణి అంజలి భరద్వాజ్ను అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికచేసింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని గుర్తించి, ప్రోత్సహించేందుకు బైడెన్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన ‘అంతర్జాతీయ అవినీతి నిరోధక చాంపియన్స్ అవార్డు’కు ఆమె పేరును ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12 మందిని ఎంపికచేయగా, అందులో అంజలి భరద్వాజ్ ఒకరు. సమాచార హక్కు ఉద్యమంలో ఆమె రెండు దశాబ్దాలకుపైగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని బైడెన్ ప్రభుత్వం కొనియాడింది. ‘నేషనల్ క్యాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్’కు (ఎన్సీపీఆర్ఐ) అంజలి కన్వీనర్గా ఉన్నారు. ఎన్సీపీఆర్ఐ పోరాటం ఫలితంగానే అవినీతి నిరోధక అంబుడ్స్మన్ ఏర్పాటైంది. అలాగే ప్రజావేగు రక్షణ చట్టం రూపుదిద్దుకుంది.