వాషింగ్టన్: కంప్యూటర్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అమెరికా వ్యాప్తంగా విమానాలపై ప్రభావం పడింది. ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోయాయి. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. విమాన ప్రమాదాల గురించి పైలట్లు, ఇతర విమాన సిబ్బందిని హెచ్చరించే ‘ఎయిర్ మిషన్ల నోటీసు’ వ్యవస్థ విఫలమైనట్లు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తెలిపింది. దీని వల్ల అమెరికా వ్యాప్తంగా గగనతలం వ్యవస్థ ప్రభావితమైనట్లు పేర్కొంది. ఈ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించింది. విమానాశ్రయంలో సేవలకు సంబంధించిన ఈ సమస్య పరిష్కారంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని వెల్లడించింది.
కాగా, ఎయిర్ మిషన్ల నోటీసు వ్యవస్థలో సాంకేతిక సమస్య వల్ల అమెరికా వ్యాప్తంగా సుమారు 760 విమానాలపై ప్రభావం పడింది. ఆ దేశం నుంచి బయటకు వెళ్లే, దేశంలోకి వచ్చే విమానాల రాకపోకలు ఆలస్యమైనట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ఎవేర్ పేర్కొంది. ఎయిర్పోర్టుల్లో ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోవడం, విమానాల రాకపోకల్లో ఆలస్యం వల్ల అమెరికా వ్యాప్తంగా విమాన ప్రయాణికులు గందరగోళానికి లోనయ్యారు.
మరోవైపు వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్ర దాడి తర్వాత దేశం మొత్తంగా గగనతలాన్ని మూసివేసిన ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నదని విమానయాన నిపుణుడు పర్వేజ్ దమానియా తెలిపారు. నమ్మలేని ఈ అంతరాయం ఆశ్చర్యం కలిగిస్తున్నదని చెప్పారు.
The FAA is working to restore its Notice to Air Missions System. We are performing final validation checks and reloading the system now.
Operations across the National Airspace System are affected.
We will provide frequent updates as we make progress.
— The FAA ✈️ (@FAANews) January 11, 2023