వాషింగ్టన్: సాంకేతిక వైఫల్యం కారణంగా అమెరికాలో విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. వందలాది విమానాలు ఆలస్యంగా నడువగా, చాలా సర్వీసులు రద్దయ్యాయి. అయితే క్రమంగా విమానాల రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. విమానాల రద్దుతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలలో పడిగాపులు కాశారు. సైబర్ దాడుల కారణంగా ఇది జరిగిందని వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఖండిండారు. సమస్యను ఎప్పటికి సరిచేసేదీ అధికారులు చెప్పలేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. సాంకేతిక లోపం కారణంగా దేశవ్యాప్తంగా 3,700 విమానాలు ఆలస్యంగా నడిచాయని, 600 విమానాలు రద్దయ్యాయని విమానయాన సంస్థ ైఫ్టెట్ అవేర్ తెలిపింది. దీంతో అప్రమత్తమైన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ (ఎఫ్ఎఎ) అధికారులు ఎయిర్ మిషన్ సిస్టమ్ ఫెయిల్ అయినట్టు గుర్తించి దానిని పాక్షికంగా పునరుద్ధరించారు. ఎఫ్ఏఏలో సాంకేతిక వైఫల్యం గురించి పైలట్లు, ఇతర సిబ్బందిని ఇదివరకే అప్రమత్తం చేసినట్టు అధికారులు చెప్పారు.