ఇది కరోనా యుగం. ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా గురించే చర్చ. ఫస్ట్ వేవ్ పోయింది. సెకండ్ వేవ్ పోయింది. ఇప్పుడు థర్డ్ వేవ్లో ఉన్నాం మనం. ఈమధ్య డెల్టా వేరియంట్తో పాటు ఒమిక్రాన్ కూడా అందరినీ భయపెడుతోంది. ఇప్పటికే చాలామంది రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకున్నారు. పూర్తిగా వ్యాక్సినేషన్ వేయించుకున్నవాళ్లకు కరోనా సోకినా కూడా పెద్దగా సమస్యలు రావడం లేదు. ఒక వారం రోజులు మెడిసిన్ వాడితే తగ్గిపోతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని అంటున్నారు.
కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలని చెబుతున్నాయి. అయినా కూడా వ్యాక్సిన్ వేసుకోకుండా ఆఫీసుకు వస్తే ఉద్యోగంలో నుంచి తీసేసేందుకు కూడా కొన్ని కంపెనీలు వెనుకాడటం లేదు.
యూఎస్కు చెందిన ప్రముఖ టెలికాం నెట్వర్క్ కంపెనీ టీ మొబైల్ కూడా ఫుల్ వ్యాక్సినేషన్ చేయించుకోని ఉద్యోగులను తీసేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 2, 2022 లోపు ఫుల్ వ్యాక్సినేషన్ వేసుకోని కార్పొరేట్ ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు ప్రణాళికలు రూపొందించింది.
యూఎస్ సుప్రీం కోర్టు రూలింగ్ ప్రకారం టీ మొబైల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 21 లోపు ఫస్ట్ డోస్ తీసుకోని ఉద్యోగులు, ఫస్ట్ డోస్ తీసుకుంటే దాని ప్రూఫ్ అప్లోడ్ చేయకపోతే.. వాళ్లను అన్పేడ్ లీవ్ కింద పరిగణిస్తాం అని కంపెనీ ఉద్యోగులకు మెయిల్లో స్పష్టం చేసింది. అలాగే.. ఏప్రిల్ 2 లోపు పూర్తిగా వ్యాక్సినేషన్ వేసుకోకపోతే వాళ్లను కంపెనీ నుంచి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగిస్తాం అని కంపెనీ స్పష్టం చేసింది.