వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధి వద్ద ప్రస్తుతం అమెరికా యుద్ధ నౌకలు మోహరించి ఉన్నాయి. ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో అమెరికాకు చెందిన మూడు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ యుద్ధనౌకలు విధులు నిర్వహిస్తున్నాయి. అయితే యుద్ధ నౌకల్లో పనిచేస్తున్న సిబ్బంది.. ప్రతి రోజు సుమారు 12 000 కోడి గుడ్లు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా సెంట్రల్ కమాండ్(US CENTCOM) దీనిపై ఓ ఆసక్తికర పోస్టు చేసింది. అమెరికా నౌకదళానికి చెందిన వారిలో సెయిలర్లు, మెరైన్లు ఉన్నారు.
ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్ క్యారియల్లో ప్రతి రోజు సిబ్బంది కోసం సుమారు 4000 గుడ్లను వాడుతారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం అబ్రహం లింకన్, జార్జ్ బుష్, గెరాల్డ్ ఫోర్డ్ యుద్ధ నౌకలు విధుల్లో ఉన్నాయి. దీంట్లో ప్రతి యుద్ధనౌకలో ఉన్న సిబ్బంది ప్రతి రోజు సుమారు 4 వేల గుడ్లు తినే అవకాశం ఉన్నది. అంటే మూడు నౌకలకు చెంది మొత్తం 12వేల గుడ్లు రోజు అమెరికా నేవీ సేవిస్తున్నట్లు తెలుస్తోంది.
Sailors aboard aircraft carrier USS Abraham Lincoln (CVN 72) serve meals to crew members. A typical aircraft carrier strike group serves around 4,000 eggs daily.
Three aircraft carrier strike groups are currently operating in the Middle East. Combined, the Sailors and Marines… pic.twitter.com/S02RerxDB5
— U.S. Central Command (@CENTCOM) April 23, 2026