న్యూఢిల్లీ: విశ్వసుందరి( Miss Universe) పోటీలకు అప్పర్ ఏజ్ లిమిట్పై ఉన్న నిబంధనను ఎత్తివేశారు. 28 ఏళ్లు దాటిన మహిళలు.. ఇక నుంచి ఆ అందాల పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. గత ఏడాది మిస్ యూనివర్స్ టైటిల్ నెగ్గిన ఆర్ బొన్ని గాబ్రియల్ ఇవాళ దీనిపై ప్రకటన చేసింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె దీనిపై ఓ పోస్టు కూడా పెట్టింది. గతంలో విశ్వసుందరి పోటీలకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలే అర్హులు. అయితే న్యూయార్క్లో జరిగిన ఫ్యాషన్ వీక్ షోలో గాబ్రియల్ ఈ ప్రకటన చేశారు. 1952లో మిస్ యూనివర్స్ పోటీలు ప్రారంభం అయ్యాయి. బొన్న ప్రస్తుతం వయసు 29 ఏళ్లు.