ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధాని నరేంద్ర మోదీకి శనివారం ఫోన్ చేశారు. రష్యా బాంబుల మోత మోగిస్తూ.. ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో భారత్ సాయం కావాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు మోదీని కోరారు. ప్రస్తుత పరిస్థితుల గురించి వీరిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వెలెన్స్కీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఐరాసలోని భద్రతా మండలిలో తమకు రాజకీయంగా మద్దతు కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు భారత ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించారు.
రష్యా దాడులు ఆపేలా తగిన చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు మోదీని కోరారు. ‘భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాను. రష్యా దురాక్రమణ, ఉక్రెయిన్ తిప్పికొడుతున్న విధానాన్ని ఆయనకు వివరించాను. సుమారు లక్ష మంది ఆక్రమణ దారులు ఉక్రెయిన్లోనే ఉన్నారు. నివాస భవనాలపై బాంబు దాడులు చేస్తున్నారు. భద్రతా మండలిలో రాజకీయ మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరాను’ అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్విట్టర్లో పేర్కొన్నారు.