ఉక్రెయిన్పై రష్యా బాంబులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నియంత హిట్లర్ను అంతర్జాతీయ సమాజం ఎలాగైతే మట్టికరిపించిందో… ఇదే పంథాను ఉక్రెయిన్ అమలు చేయబోతోంది. ఆ సమయంలో సైనిక సహాయంతో పాటు అంతర్జాతీయ పౌర సమాజం మద్దతు కూడా అప్పుడు కోరింది. ఇప్పుడు ఉక్రెయిన్ కూడా ఇలాగే చేస్తోంది.
ఉక్రెయిన్ను రక్షించుకునే పనిలో భాగంగా విదేశీ అంతర్జాతీయ వాలెంటీర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఉక్రెయిన్కు ఎవరైనా సహాయపడాలని భావిస్తే.. ఇదే మంచి తరుణమని, ఇదే సరైన పద్ధతి అని ఆయన వివరించారు. ఈ వాలెంటీర్ సంస్థలోకి విదేశీయులు చేరాలని భావిస్తే.. తమ తమ దేశాల్లో ఉన్న ఉక్రెయిన్ రాయబార కార్యాలయాలను సంప్రదించాలని ఆయన సూచించారు.