కీవ్: ఉక్రెయిన్లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఖార్కివ్ నగరంలో రష్యా జరిపిన దాడుల్లో సుమారు వెయ్యికి పైగా బిల్డింగ్లు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ధ్వంసమైన వాటిలో ఎక్కువ శాతం రెసిడెన్షియల్ బిల్డింగ్లు ఉన్నట్లు చెప్పింది. ఆ సిటీపై ప్రతి రోజూ దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఇప్పటి వరకు అక్కడ 500 మంది పౌరులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.
రష్యా-ఇజ్రాయిల్ బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్కు చెందిన రెండు నౌకలను టర్కీలో సీజ్ చేశారు. సంపన్న రష్యన్లపై యురోపియన్ దేశాలు ఆర్థక ఆంక్షలను విధిస్తున్న విషయం తెలిసిందే. 160 మీటర్ల పొడువైన ఎక్లిప్స్ బోటును మార్మారిస్ పోర్టు వద్ద నిలిపేశారు. ఇప్పటికే బోడ్రమ్లో 140 మీటర్ల పొడువైన సూపర్ బోట్ సోలారిస్ను సీజ్ చేశారు.
35 లక్షల మంది ఉక్రెయిన్ను వదిలి వలస వెళ్లినట్లు యూఎన్ అంచనా వేసింది. సుమారు 15,300 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ మిలిటరీ శాఖ పేర్కొన్నది. రష్యాకు చెందిన 509 ట్యాంక్లు, 1556 ఆర్మర్డ్ కంబాట్ వాహనాలు, 252 ఆర్టిల్లరీ వ్యవస్థలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది.