బ్రసెల్స్: ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధం ముగియడానికి ఏళ్ల సమయం పడుతుందని నాటో డిప్యూటీ కార్యదర్శి జనరల్ మెర్సియా జియనోవా తెలిపారు. తాజాగా రష్యా జరిపిన దాడుల్లో ఉక్రెయిన్కు చెందిన రేడియో లిబర్టీలో పనిచేస్తన్న జర్నలిస్టు వెరా గిరిచ్ మృతిచెందినట్లు తెలుస్తోంది. యూఎన్ చీఫ్ ఉక్రెయిన్లో పర్యటిస్తున్న సమయంలో రష్యా తన దాడులతో యూఎన్ను అవమానిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. బ్రిటన్ ఎన్జీవోకు చెందిన ఇద్దర్ని రష్యా మిలిటరీ బంధించిందన్నారు. అజోవ్స్తల్ స్టీల్ ప్లాంట్లో ఉన్న సాధారణ పౌరుల్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు జెలెన్స్కీ తెలిపారు.