చండీగఢ్, ఏప్రిల్ 28: లండన్కు చెందిన దేబోరా హాడ్జ్(49) అనే మహిళ పిల్లిని పెండ్లి చేసుకొన్నారు. జంతువులను పెంచుకొంటున్నవారికి ఇల్లు కిరాయికి ఇవ్వబోమని ఇంటి యజమాని షరతు పెట్టడంతో పెంపుడు పిల్లిని వదులుకోలేక ఈ నిర్ణయం తీసుకొన్నారు. తాను ఇప్పుడు పిల్లిని పెంచుకోవడం లేదని, తన భాగస్వామి అని చెప్తున్నారు. ఆ పిల్లి పేరు ఇండియా. హాడ్జ్ ఇద్దరు పిల్లలకు తల్లి.