లండన్, జూలై 12: బ్రిటన్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు రికార్డవుతున్నాయి. తీవ్ర వేడిమితో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో దేశంలో నేషనల్ హీట్వేవ్ ఎమర్జెన్సీ విధించాలని అధికారులు చర్చలు జరుపుతున్నాయి.
అత్యవసర స్థితి కనుక విధిస్తే స్కూళ్లు, కాలేజీలు, న్యూక్లియార్ విద్యుత్తు కేంద్రాలు, పర్యాటక కేంద్రాలు మూతపడనున్నాయి. ఆరోగ్య సేవలకు కూడా ఆటంకం కలుగనున్నది.