లండన్, అక్టోబర్ 3: బ్రిటన్లో విద్యనభ్యసించాలనుకొనే విద్యార్థులకు చేదువార్త. బ్రిటన్ ప్రభుత్వం విద్యార్థి వీసాల ఫీజులను భారీగా పెంచింది. ఆరునెలల లోపు గడువుతో ఆ దేశంలో పర్యటించాలనుకొనేవారి వీసాల చార్జీలను కూడా పెంచింది. ముఖ్యంగా విద్యార్థి వీసాల చార్జీలను 490 గ్రేట్ బ్రిటన్ పౌండ్లు (జీబీపీ) పెంచింది.
పర్యాటక వీసాలపై 115 జీబీపీలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు బుధవారం నుంచే అమల్లోకి రానున్నది. వీసా ఫీజుల పెంపును బ్రిటన్ హోంశాఖ సమర్థించుకొన్నది. దేశంలో ప్రజా పనులకు అధిక నిధులు కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించింది.