అబు దాబి : ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చిన వేళ యూఏఈలోని బరకహ్ అణు విద్యుత్తు కేంద్రంపై ఆదివారం డ్రోన్ దాడి జరిగింది. ప్లాంట్లోని విద్యుత్తు జనరేటర్ వద్ద ఈ దాడి జరగడంతో మంటలు చెలరేగాయని అబు దాబి మీడియా ఆఫీస్ వెల్లడించింది. రేడియేషన్ ప్రభావం చూపే స్థితిలో వెలువడలేదని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఆ ప్లాంట్ కీలక విభాగాలు సాధారణంగానే పని చేస్తున్నాయని వెల్లడించారు. ఈ దాడి చేసిందెవరో ఇంకా తెలియలేదు. ఈ దాడిపై అంతర్జాతీయ అణు శక్తి ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేసింది. హొర్ముజ్ జల సంధి మార్గంపై ఆధారపడకుండా ముడి చమురును ఎగుమతి చేసే కొత్త పైప్లైన్ ప్రాజెక్ట్ పనులను యూఏఈ వేగవంతం చేసిన వేళ ఈ దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తున్నది. సౌదీ సరిహద్దుల్లోని పశ్చిమ ఎడారి మారుమూల ప్రాంతంలో ఈ విద్యుత్తు కేంద్రం ఉన్నది. అరేబియా ద్వీప కల్పంలో ఇదే ఏకైక అణు విద్యుత్తు కేంద్రం.