న్యూఢిల్లీ : పాకిస్తాన్లోని ఖైబర్ ఫఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో ఆదివారం ఇద్దరు సిక్కు వ్యాపారవేత్తలను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. హత్యకు గురైన ఇద్దరు సిక్కులు బటాతాల్ మార్కెట్లో సుంగధ ద్రవ్యాలను విక్రయదారులని పెషావర్ పోలీసులు తెలిపారు. మృతులు సల్జిత్ సింగ్ (42), రంజిత్ సింగ్ (38)గా గుర్తించారు. కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దుండకుల కోసం గాలించారు. ఇదిలా ఉండగా.. పెషావర్లో దాదాపు 15వేల మంది సిక్కులు నివసిస్తున్నారు.
వీరిలో ఎక్కువ మంది ప్రాంతీయ రాజధానికి సమీపంలోని జోగన్ షాలో నివసిస్తున్నారు. పెషావర్లో నివసించే చాలా మంది సిక్కులు వ్యాపారులు చేస్తుండగా.. కొందరు ఫార్మసీలను నడుపుతున్నారు. దాడిని ఖబైర్ ఫఖ్తున్ఖ్వా సీఎం మహమూద్ ఖాన్ ఖండించారు. నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. గత సెప్టెంబర్లోని ఓ సిక్కు సైతం హత్యకు గురయ్యాడు. అంతకు ముందు పలువురు సిక్కులు హత్యకు గురయ్యారు. 2020లో రవీంద్ర సింగ్ అనే న్యూస్ ఛానెల్ యాంకర్తో పాటు 2016లో పాక్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడు సోరెన్ సింగ్ సైతం పెషావర్ హత్య చేశారు.