రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల
చిక్కడపల్లి, మార్చి 15: కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించి రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. కాన్షీరాం జయంతి సందర్భంగా విశ్వజన కళా మండలి, ఆదిజాతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారంసుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కళానిధి మాస్టార్జీ రచించిన ప్రభావశీరులు పాటల అంకిత కార్యక్రమం నిర్వహించారు. హాజరైన ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పీడిత కులాలకు అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించారని, ఆ హక్కులను కేంద్రం హరిస్తున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో జేబి రాజు, డీ యాదయ్య, హరినాథ్ బోధి, పాడేటి జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.