న్యూఫౌండ్ల్యాండ్: కెనడాలోని న్యూఫౌండ్లాండ్కు సమీపంలో ఉన్న టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన మినీ జలాంతర్గామి టైటాన్ సబ్(Titanic Sub) అదృశ్యమైన విషయం తెలిసిందే. ఆ సబ్మెర్సిబుల్ టైటాన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఆ సబ్లో 5 మంది ఉన్నారు. సముద్రంలో దాదాపు 4 కిలోమీటర్ల లోతు వరకు రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయి. టైటానిక్ నౌక శిథిలాల ఉన్న ప్రాంతాన్ని మిడ్నైట్ జోన్గా పిలుస్తారు. అక్కడ ఉష్ణోగ్రతలు శీతలంగా ఉంటాయి. ఇక అంతా చీకటే ఉంటుంది. దాదాపు రెండున్నర గంటల పాటు కటిక చీకల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుందని గతంలో జర్నీ చేసిన కొందరు చెబుతున్నారు. సబ్మెర్సిబుల్లో ఉన్న లైట్లతో కేవలం కొంత దూరం వరకే కనిపిస్తుందన్నారు.
ఆదివారం టైటాన్ సబ్ మిస్సైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సబ్లో సుమారు 40 గంటలకు సరిపడా ఆక్సిజన్ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మాత్రం కేవలం 10 గంటల లోపు సరిపోయే ఆక్సిజన్ మాత్రమే ఉందని చెబుతున్నారు. ఆ మినీ సబ్లో పాకిస్థాన్కు చెందిన ఇద్దరు సంపన్నులతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. సముద్ర గర్భంలోకి వెళ్లి పోయిన టైటాన్ నుంచి శబ్ధాలు వస్తున్నట్లు కెనడా సోనార్లు గుర్తించినా ప్రస్తుతం పరిస్థితి అనిశ్చితిలోనే ఉంది.
ఒకవేళ ఆక్సిజన్ అయిపోతే పరిస్థితి ఏందన్న ఆందోళన మొదలవుతోంది. ఆక్సిజన్ లేని సమయంలో మనిషి ఎక్కువ సేపు బ్రతకడం కష్టమే. ఆయా వ్యక్తుల జీవక్రియను బట్టి కొంత సమయం బ్రతికే ఛాన్సు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్ వాడకాన్ని ఎంత తగ్గిస్తే.. అంత ఎక్కువ సమయం వాళ్లు సజీవంగా ఉండే అవకాశాలు ఉంటాయి. రెస్టు తీసుకుని, రిలాక్స్గా ఉంటే ఎక్కువ సేపు ఆక్సిజన్ వినియోగించుకోవచ్చు. ఒకవేళ జీవక్రియ పెరిగితే అప్పుడు కార్బన్ డైయాక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్ అయిపోయిన తర్వాత వారం కన్నా ఎక్కువ రోజులు బ్రతికే ఛాన్సు ఉందా అన్న ప్రశ్నకు సరైన సమాధానం దక్కడం లేదు.