వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దేశంలో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా రాజధాని ఆక్లాండ్లో పరిస్థితి దారుణంగా ఉంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల వీధులు తటాకాల్లా మారిపోయాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు, వస్తు సామాగ్రి నీళ్లలో కొట్టుకుపోవడం, మునిగిపోవడం కనిపించింది.
దాంతో న్యూజిలాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణం ఒక్కసారిగా విషాదకరంగా మారడంపై న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హప్కిన్స్ ఆందోళన వ్యక్తంచేశారు. ముంపు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సర్వీసులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తాను ముంపు ప్రాంతాలను సందర్శించేందుకు బయలుదేరనున్నట్లు తెలిపారు. కాగా, ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. న్యూజిలాండ్లో వర్షాలు వరదల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గల్లంతయ్యారు.