బీజింగ్ : అమెరికాపై సెప్టెంబర్ 11 నాటి దాడులు మళ్లీ జరిగే అవకాశాలు ఉన్నాయని చైనా భావిస్తున్నది. ఇదే విషయంపై అమెరికాను చైనా (China Warning) హెచ్చరిస్తున్నది. ఈ విషయాలను చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’లో ఎడిటర్ హు షిజిన్ పేర్కొన్నారు. అమెరికాపై దాడులు జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎడిటర్ హు షిజిన్ ఈ విషయాలను ఊహిస్తున్నట్లు వెల్లడించారు.
సెప్టెంబర్ 11 నాటి దాడి 19 మంది ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి అని, అయితే ఇది ఉగ్రవాద ఆత్మాహుతి దాడి మాత్రం కాదని హు షిజిన్ అన్నారు. మరో ఘోరమైన దాడికి ఉగ్రవాదం బలం చేకూరుస్తుందని తెలిపారు. చైనాను తమ అతిపెద్ద శత్రువుగా భావించడం అమెరికా తప్పేనా అనేది కాలమే నిర్ణయిస్తుందని.. చైనా-అమెరికా మధ్య సంబంధాలు చాలా క్షీణించాయని చెప్పారు. చైనాలోని ఉయ్ఘార్ ముస్లింలపై జరిగిన దారుణాలపై అమెరికా మిత్రదేశాలు కూడా చైనాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
అమెరికా తమ రాజకీయ ప్రయోజనాల ఆధారంగా ఉగ్రవాదులను నిర్వచించడం మానేయాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ సూచించారు. ఉగ్రవాదులు ఉగ్రవాదులు మాత్రమే అని ఆయనన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను నిర్వచించడం అంటే.. అంతర్జాతీయంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటాన్ని నిర్వీర్యం చేయడమే అవుతుందన్నారు.
హైదరాబాద్ను వదులుకుంటే కశ్మీర్ ఇస్తామని ప్రతిపాదన.. ఎవరు చేశారంటే..?
టీవీ యాంకర్గా నటుడు సోనూ సూద్.. ఏ ఛానల్లో.. ఏ ప్రోగ్రాంలో..?
1500 మందితో పాట షూటింగ్.. ఒక్కరికీ కరోనా రాలేదు! ఎందుకంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..